SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి జగనన్న హయాంలో పేదలకు జరుగుతున్న మంచి చూసి ప్రతిపక్షాల నాయకులు కూడా వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.

గుంటూరులోని ఎమ్మెల్యే నివాసంలో స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వ పనితీరుతోనే పార్టీలో చేరికలు పెరిగాయని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడానికి కృషి చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో జడల ఉదయశ్రీ, జడల ఏసమ్మ, వేమవరపు మరియమ్మ, వేమవరపు ఏసమ్మ, కంభంపాటి నాగమ్మ, పద్మ, చిన్నమ్మాయి. మరియదాసు, వేమవరపు బాబు, ఇంద్ర, మారెళ్ల ఆదినారాయణ, నవ్య, వేమవరపు శిరీష, రవికిరణ్, బెజ్జంకి రాజశేఖర్, కోటేశ్వరమ్మ తదితరులున్నారు.


SAKSHITHA NEWS