SAKSHITHA NEWS

తిరుమల తిరుపతి దేవస్థానముల నూతన చైర్మెన్ గా నియమింపబడిన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డిని తిరుపతి పద్మావతి పురంలోని ఆయన నివాసంలో ప్రముఖ సింగర్ మంగ్లీ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసారు.

టీటీడీ చైర్మెన్ గా మీ సేవలను మరింత విస్తరించాలని మంగ్లీ కోరడం జరిగింది. చైర్మెన్ భూమన మాట్లాడుతూ ఇటివల జరిగిన తిరుపతి గంగమ్మ జాతరలో తిరుపతి గంగమ్మపై మంగ్లీ పాడిన పాటలు ప్రజల్లోకి చొచ్చుకెల్లిన విషయాన్ని గుర్తు చేస్తూ మంగ్లీ తన భక్తి పాటలను మరిన్ని ప్రజలకు అందీవ్వాలన్నారు. మంగ్లీతో బాటు ఇంప్రెస్ ఈవేంట్స్ నిర్వహకులు కిషన్ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డికి అభినందనలు తెలియజేసారు.


SAKSHITHA NEWS