SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మంత్రి భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గార్ల ఆదేశాల మేరకు..శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపుమేరకు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ ఫేస్ 1 మరియు ఫేస్ 2 లో కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ ఫేస్ 1, ఫేస్ 2 లో అభివృద్ధి పనులన్నీ దాదాపు తొంభై శాతం పూర్తైయ్యాయని, పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న పనులను వెంటనే పూర్తిచేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. చెత్త శుభ్రం చేయడం, స్టీట్ లైట్లు మార్చడం వంటి చిన్న సమస్యలను ఈరోజే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా తొమ్మిదేళ్ల కాలంలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు మరియు అందించిన సంక్షేమ పథకాలను ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి అందించడం జరిగింది.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, అనిల్ రెడ్డి, రాజేష్ చంద్ర, కాశినాథ్ యాదవ్, గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, భాస్కర్ రెడ్డి, వెంకట్ నాయక్, బి.వెంకటేష్ గౌడ్, సంపత్ రెడ్డి, టి.నరసింగరావు, ఎం.కృష్ణ గౌడ్, కుమారచారి, శంకర్, వెంకటస్వామి, నరసింహ రెడ్డి, రాంరెడ్డి, యాదగిరి, బాలస్వామి, ప్రదీప్ రెడ్డి, రాములుగౌడ్, మల్లేష్, వెంకటేష్ గౌడ్, వాలి నాగేశ్వరరావు, భిక్షపతి, సంతోష్ బిరాదర్, ఇంతియాజ్, రవీందర్, అర్జున్, బాలస్వామి, ఆదర్శ్, సాయిగౌడ్, కూర్మయ్య, బాబు నాయక్, బాలరాజు, దేవేందర్, సతీష్, జనయ్య, మల్లేష్, అజ్జస్, రాజ్యలక్ష్మి, మధులత, శిరీష సత్తుర్, లక్ష్మమ్మ, పుట్టం దేవి, షేక్ బీబీ, స్వరూపా, స్వప్న, వరలక్ష్మి, రేణుక, సురేఖ, ప్రీతి, నస్రీన్, నిర్మల, బి.లక్ష్మీ జిఎచ్ఎంసి అధికారులు, ఆర్.పిలు, సమాఖ్య లీడర్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS