APCPDCL ఆఫిసు పై ACB అధికారులు దాడులు నిర్వహించారు

Spread the love

గౌరవ డిజిపి శ్రీ కె. వి. రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసిబి 14400 కాల్ సెంటర్ ద్వారా అవినీతి అధికారిపై వచ్చిన ఫిర్యాదులతో ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం APCPDCL ఆఫిసు పై ACB అధికారులు దాడులు నిర్వహించారు.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ కు చెందిన బాధితుడు శ్రీ G. ప్రవీణ్ కుమార్ కొత్త ఇంటికి 3 ఫేస్ విద్యుత్ కనెక్షన్ కోసం ఇబ్రహీంపట్నం APCPDCL AE శ్రీ B. శ్రీనివాసరావు ని కలవగా 50,000/- రూపాయిలు లంచంగా డిమాండ్ చేయడంతో ఫిర్యాదిదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

దీనిపైన కేసు నమోదు చేసుకున్న అధికారులు ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, ఇబ్రహీంపట్నం APCPDCL AE శ్రీ B. శ్రీనివాసరావు మరియు ఇబ్రహీంపట్నం APCPDCL జూనియర్ అస్సిస్టెంట్ ఐ. గోపీనాధ్ ఫిర్యాదిదారుడు వద్ద నుండి 50,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా విజయవాడ రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. నిందిత ఆధికార్లను అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తారు.

అవినీతి అధికారులపై ప్రజల ఫిర్యాదు కోసం 14400: అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబర్ ను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నెంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించ వచ్చని డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page