SAKSHITHA NEWS

దోర్నాలలో కల్యాణమండపం కోసం 1.98 కోట్లు మంజూరు .

షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 1.26 కోట్లు.

మంత్రి సురేష్ ప్రతిపాదనలతో నిధులు మంజూరు చేసిన శ్రీశైలం దేవస్థానం.

దోర్నాల పట్టణంలో కళ్యాణ మండపం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపారు. శ్రీశైల ముఖద్వారంగా పేరున్న ఇక్కడ ఈ రెండింటి ఆవశ్యకతను మంత్రి అధికారులకు వివరించారు. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ కమిషనర్ శ్రీశైలం దేవస్థానం నిధులనుంచి కళ్యాణ మండపం నిర్మాణానికి 1.98 కోట్లు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 1.26 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే పనులు చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. పట్టణంలో కళ్యాణమండపం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి సురేష్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


SAKSHITHA NEWS