SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి శ్రీరామాలయంలో నిర్మించనున్న కల్యాణ మండపానికి ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఆలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, దూలపల్లి పీఏసీఎస్ చైర్మన్ గరిశ నరేందర్ రాజు, కౌన్సిలర్ డప్పు కిరణ్, ఆలయ కమిటి చైర్మన్ బూర్గుబావి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గరిశ సతీష్, పీఏసీఎస్ డైరెక్టర్లు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS