SAKSHITHA NEWS

సీసీ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

సాక్షిత : 124 డివిజన్ పరిధిలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా శంశిగుడా సాయి చరణ్ కాలనీలో 10 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు పనులు పూర్తయిన సందర్భంగా రోడ్డును మంచిగా క్యూరింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. సాయి చరణ్ కాలనీ మరియు ఇంద్రా నగర్ మధ్యలో ఉన్న ప్రధాన రోడ్డులో హెవీ లోడ్ ఉన్న వాహనం వెళ్లడంతో డ్రైనేజీ లైన్ పైప్ పగిలి రోడ్డు మీద గుంత ఏర్పడి ప్రమాదకరంగా ఉందని గమనించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, వెంకట్ నాయక్, లక్ష్మమ్మ, సాయిగౌడ్, వెంకటయ్య, AE శ్రావణి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS