SAKSHITHA NEWS

సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సుభాష్ నగర్ డివిజన్ పరిధి రామి రెడ్డి నగర్ కాలనీ వాసులతో సమావేశమయ్యారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమ పథకాలు, తొమ్మిదేండ్ల పాలనలో సంస్కరణల గురించి వారికి వివరించారు. కాలనీ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘సంపర్క్ సే సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా కాలనీ లోని పలువురు విశిష్ట వ్యక్తులను కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎంఎస్ వాసు, కంది శ్రీరాములు, విస్తారక్ రాజేష్, వెంకట రత్నం, గుబ్బల లక్ష్మీనారాయణ, కాలనీ వాసులు సింగమ్మ, యాదగిరి గౌడ్, నాగలక్ష్మి, హరి, రమణయ్య, శ్రీనివాస్, గోవింద్, బాబు, మొగిలి, కిట్టు,సాయి, బాలాజీ, రమేష్, సాయి, బిజేందర్, రాజేష్, రామిరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS