హైదరాబాద్:
మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గతంలో దొమ్మాట (ప్రస్తుత దుబ్బాక) ఎమ్మెల్యేగా సోలిపేట పని చేశారు. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు రాజకీయాల్లో రాణించారు. అయితే కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో సొలిపేట పనిచేశారు. సొలిపేటకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సోలిపేట స్వస్థలం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనిలో నివాసం ఉంటోంది. అక్కడే ఆయన కన్నుమూశారు. ప్రజలు, నేతల సందర్శనార్ధం సొలిపేట రామచంద్రారెడ్డి భౌతికకాయాన్ని నివాసం వద్దే ఉంచనున్నారు సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సొలిపేట మరణవార్త తెలిసి పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
మాజీ రాజ్యసభ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత
Related Posts
మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు
SAKSHITHA NEWS మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు శంకర్పల్లి : దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. కొండకల్ గ్రామం లో అన్నపూర్ణ దేవికి చరణ్ సార్క్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యం లో…
కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
SAKSHITHA NEWS కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి. సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు. చేవెళ్ల : మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో…