SAKSHITHA NEWS

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ‘తెలంగాణ హరితోత్సవం‘ వేడుకల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూరారం లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐలు, సిబ్బంది, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS