కాచవరంలో వైభవంగా రామాలయ గుడి ప్రతిష్ట

Spread the love

ప్రత్యేక పూజలలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ .

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,

ఇబ్రహీంపట్నం మండలం కాచవరం గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయంలో గుడి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం కనులపండువగా జరిగింది. ఆలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభం ప్రతిష్ట నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page