SAKSHITHA NEWS

పేద విద్యార్థికి మంత్రి జగదీశ్ రెడ్డి ఆపన్నహస్తం
లండన్ లో ఉద్యోగం వచ్చిన పేద ముస్లిం యువకునికి రవాణా ఖర్చులకు వెయ్యి పౌండ్లు అందజేత


సాక్షిత సూర్యాపేట : పేద విద్యార్ధికి మంత్రి జగదీష్ రెడ్డి అండగా నిలిచారు. లండన్ లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి అక్కడికి వెళ్ళడానికి ఆర్దికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని వెంటనే స్పందించి ఆర్ధిక సహాయం చేశారు. వివరాల ప్రకారం సూర్యాపేట పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ నజీర్ తండ్రి చిన్నప్పుడే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నజీర్ తల్లి ఇళ్ళల్లో పనిచేస్తూ ఇద్దరు కొడుకులు, కూతురును చదివించుకుంది. తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన పెద్ద కొడుకు నజీర్ ఇటీవల లండన్ లో ఐసియూ స్పెషలిస్ట్ గ్రేడ్-5 మేల్ నర్స్ గా ఉద్యోగం సాధించాడు. ఉద్యోగం సాధించడం సంతోషమే అయినా నజీర్ కు లండన్ కు వెళ్ళే స్తోమత లేక ఇబ్బంది పడుతున్న విషయం మంత్రి జగదీష్ రెడ్డిను కలిసి విన్నవించారు. నజీర్ ఉద్యోగ వివరాలను, కుటుంబ స్థితి గతులను అడిగి తెలుసుకొని మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా వెయ్యి ఫౌండ్ లను(ఒక లక్ష రెండు వేల రూపాయలు) అందజేశారు. లండన్ పోలేనని నిస్పృహలో ఉన్న తనకు వెళ్లేందుకు రవాణా ఖర్చుల తో పాటు అక్కడ ఉండేందుకు నెల రోజలపాటు సరిపడ ఆర్ధిక సహాయం చేసిన మంత్రి జగదీశ్ రెడ్డికి నజీర్ కృతజ్ఞతలు తెలిపారు.


SAKSHITHA NEWS