SAKSHITHA NEWS

గుమ్మడిదల మండలం అనంతరం గ్రామంలో నివాసము ఉండే ఊట్ల ప్రమీల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందని , పేద కుటుంబం అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది.
ఇట్టి విషయాన్ని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సోదరుడు రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి ద్వారా (10000)పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిమ్ముల దీపా నరేందర్ రెడ్డి ఉప సర్పంచ్ పెరుగు స్వరూప లక్ష్మణ్ వార్డు సభ్యులు పెరుగు రమణ కురుమ వెంకటేష్ మాజీ సర్పంచ్ కొమ్ము కృష్ణయ్య బిఆర్ఎస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ మన్నే మహేష్ యాదవ్ నాయకులు కావలి నర్సింగ్ రావు కొమ్ము పోచయ్య నర్సింలు పద్మారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS