ఏరువాక కొనసాగాలంటే టిడిపి తోనే సాధ్యం

Spread the love

రైతు రాజ్యం రావాలంటే చంద్రబాబు నాయుడు తోనే సాధ్యం

ఏరువాక కొనసాగాలంటే టిడిపి తోనే సాధ్యం

తిరుపతి జిల్లా,చంద్రగిరి

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు మహానాడు లో రైతులపై వరాల జల్లు కురిపించారు.

దీనితో చంద్రగిరి మండలంలోని రైతులు చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు , నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులు సుభిక్షంగా వ్యవసాయం చేసుకునే వారిని రైతే రాజు అన్న పదానికి నిదర్శనంగా రైతులు బ్రతికే వారిని అన్నారు .

అయితే వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు దళారుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని కనీస పెట్టుబడి కూడా రాని దుస్థితిలో రైతులు ఉన్నారని వ్యవసాయం దండగనే స్థితికి రైతులు చేరుకున్నారని వాపోయారు .

చంద్రబాబునాయుడు హయాంలో సబ్సిడీ విత్తనాలు , సబ్సిడీ పనిముట్లు ఇచ్చి రైతులను ఆదుకునే వారని వారికి ఎల్లప్పుడూ అండగా ఉండే వారిని తెలిపారు .

అయితే వైకాపా ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇచ్చిన పనిముట్లకి సబ్సిడీకి రెండు రెట్లు ఎక్కువగా డబ్బులు వసూలు చేసి సబ్సిడీ అనే పేరుతో మోసం చేస్తున్నారని రైతులు వాపోయారు.

రైతు గర్వంగా బతకాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరూ అందుకు సహకరించాలని రైతులు కోరారు ….

Related Posts

You cannot copy content of this page