SAKSHITHA NEWS

అకాల వర్షంతో నష్టపోయిన మొక్కజొన్న రైతు.

వర్షంతో మొలకెత్తిన మొక్కజొన్న పంటను పరిశీలించిన జీ.వి ఆంజనేయులు.

వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

నష్టపోయిన రైతుకు పరిహారం చెల్లించాలి.

పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు డిమాండ్.

అకాల వర్షాలతో ఆరుకాలం కష్టించి పండించిన పంట తడిచి రైతులు తీవ్రంగా నష్టపోయి కన్నీళ్లు పెడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్ష పాత్ర వహించడం దారుణమని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో అకాల వర్షానికి తడిసి మొక్క మొలిచిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. తీవ్రంగా నష్టపోయిన రైతు దూళిపాల రామకృష్ణ తోపాటు మరికొందరు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.


SAKSHITHA NEWS