SAKSHITHA NEWS

ప్రతి పేదింటి ఆడ బిడ్డకు అండగా ఉంటా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో మాజీ మైనార్టీ అధ్యక్షుడు రషీద్ హుస్సేన్ గత వారం రోజుల నుండి ఆసుపత్రిలో ఉన్నాడు . తనకు పాపా పుట్టి అనారోగ్యంతో ఉండటంతో మల్లారెడ్డి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తక్షణమే తనయుడు రాష్ట్ర యువజన నాయకుడు గూడెం విక్రమ్ రెడ్డి ద్వారా 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి అందించటం జరిగింది .
ఈ కార్యక్రమంలో నల్లవల్లి గ్రామ సర్పంచ్ దోమడుగు శంకర్ , మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ముదిరాజ్ , మండల సోషల్ మీడియా అధ్యక్షుడు నల్లవల్లి వార్డ్ సభ్యుడు ఫయాజ్ షరీఫ్ , యస్ యమ్ సి ఛైర్మన్ భాస్కర్ చారి , మాజీ వార్డ్ సభ్యుడు తలారి బాలయ్య ముదిరాజ్ , సీనియర్ నాయకుడు జైపాల్ ముదిరాజ్ , గువ్వల బాలయ్య యువజన నాయకులు రాగుల నవ తేజ్ , చెన్నపురం శివ , విరేశ్ గౌడ్ , షేక్ ఉమాన్ మొదలైన వారు పాల్గొన్నారు .


SAKSHITHA NEWS