SAKSHITHA NEWS

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
నకిరేకల్ సాక్షిత ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతపల్లి మండలం భీమారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం ధ్వారా 45 లక్షలతో అభివృద్ధి చేసిన పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటవస్తువులను పంపిణి చేసారు.
అనంతరం తుంగతుర్తి గ్రామంలో రూ. 30 లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సిఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం కెసిఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS