SAKSHITHA NEWS

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని వివిధ ఈద్గాల వద్ద పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని, మైనారిటీ సోదరులను ఆత్మీయ ఆలింగనం చేసుకొని, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.


పవిత్ర రంజాన్ మాసంలో నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తెలంగాణకు
ప్రత్యేకమైన “గంగజమునా తెహజీబ్” మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజ‌ల‌ జీవితాల్లో సుఖసంతోషాలను నింపాల‌ని ఆకాంక్షిస్తూ…..
వికారాబాద్ నియోజకవర్గం మరియు జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముస్లీం సోదరులు మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS