SAKSHITHA NEWS

చలివేంద్రాన్ని ప్రారంభించిన కెనర బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఆదివారం రోజు కెనరా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు రెండు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈసందర్బంగా కెనరా బ్యాంక్ ఎంప్లాయిన్ యూనియన్ స్టేట్ కమిటి అసిస్టెంట్ సెక్రటరి ఎ.రాజశేఖర్ మాట్లాడుతూ మా యొక్క ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో ప్రతి సంవత్సరము ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తు మా ఎంప్లాయిస్ యూనియన్ ద్వారా చేస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరము ఆనాధ పిల్లలకు బట్టలు,ప్రభుత్వ స్కూల్స్ లో ఫ్యాన్లు,కూర్చీలు,పరిక్ష ఫ్యాడ్లు పెన్నులు,వాటర్ ఫిల్టర్, బీరువా, సామాగ్రిలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ కమిటి మెంబర్ మునుగోటి స్వామి, మరియు బత్తుల శ్రీను, ప్రవీణ్, కిరణ్,పాపయ్య,దినేష్,విగ్నేష్,మరియు సింగిల్ విండో మాజీ చైర్మన్ నర్ర మోహన్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ సాగర్ల నరేష్, జిల్లా యువజన సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి మేడి హరికృష్ణ, వెంకన్న, రమేష్, తిరుమలేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS