SAKSHITHA NEWS

అశ్వారావుపేట లో బిఆర్ఎస్ కు భారీ షాక్?

మూకుమ్మడి రాజీనామాలు చేసిన పొంగులేటి వర్గీయులు

అశ్వారావుపేట(సాక్షిత న్యూస్) బిఆర్ఎస్ కు పొంగులేటి వర్గీయులు భారీ షాక్ ఇచ్చారు. స్థానిక పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సస్పెన్సన్ కి సంఘీభావంగా సంఘీభావంగా మండలం రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్, పార్టీ కి మరియు పదవికి, అశ్వారావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అట్టం రమ్య, ఉప సర్పంచ్ రేమళ్ళ కేదార్నాథ్, మరియు ముగ్గురు వార్డు మెంబర్లు, అశ్వారావుపేట రెండవ సెగ్మెంట్ ఎంపీటీసీ నండ్రు జయ భారతి, అచ్యుతాపురం సర్పంచ్ యాట్ల నాగలక్ష్మి, ఆసుపాక సర్పంచ్ కునుసోతు లింగయ్య, బచ్చువారిగూడెం సర్పంచ్ కుంజా గంగాభవాని, వార్డు మెంబర్, గ్రామ అధ్యక్షులు, గుర్రాల చెరువు ఉప సర్పంచ్ పైడి శ్రీనువాస్, మామిళ్ళవారిగూడెం వార్డు మెంబర్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పల్లేల రామలక్ష్మయ్య, మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, జూపల్లి రమేష్ లు మాట్లాడుతూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంఘీభావంగా మండలంలో మరింత మంది బిఆర్ఎస్ నుండి పొంగులేటి చెంతకు రానున్నారని, రానున్న కాలంలో పొంగులేటి బాటలో పయనిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పొంగులేటి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS