SAKSHITHA NEWS

-మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం

ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని సీఎం జగనన్న ప్రభుత్వం వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.

ఆయన సాయంత్రం మైలవరం సచివాలయం-5 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వందల హామీలు ఇచ్చి, ఇచ్చిన హామీలను కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, సున్న వడ్డీ పథకాలను గత ప్రభుత్వం అరకొరగా అమలు చేసి నీరు కార్చిందన్నారు.

కానీ నేడు మన జగనన్న నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేస్తుందని, ఇది పేద ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి తార్కాణమని పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా ఈబిసి నేస్తం పథకాన్ని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఆడిన మాట తప్పని నైజం జగనన్నదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS