SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య పనిచేస్తున్నారని మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1 వార్డు శివనేనిగూడెంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి
వార్డు ప్రజలతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని వార్డు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు,
కో ఆప్షన్ మెంబర్ రుద్రవరం పద్మ యాదయ్య, బొబ్బలి బిక్షం రెడ్డి కన్నబోయిన శ్రీశైలం జిట్టా చంద్రకాంత్, దాసరి నరసింహ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS