SAKSHITHA NEWS

లింగస్వామికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వీరేశం

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం
చిన్న కాపర్తి గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్త బత్తుల లింగస్వామి ట్రాక్టర్ ప్రమాదంలో మరణించడంతో నకిరేకల్ మాజీ శాసనసభ్యులు ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం వారి పార్థివ దేహానికి పూలమాలు వేసిన నివాళులర్పించారు.
వారి కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అంతిమ సంస్కారాల ఖర్చులకి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం కార్యకర్త పాడమోసి చివరిదాకా నడిచాడు.
టిఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు కాటన్ వెంకటేశం ఏదుల గురు కృష్ణ బట్టు ఐలేష్ కుక్కల మోహన్ హెల్మెట్ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ చినకాపర్తి ఉప సర్పంచ్ ఆవుల రమేష్ ఆవల సుందర్ మాజీ సర్పంచ్ సోమయ్య టిఆర్ఎస్ నాయకులు తదితరులు నివాళులర్పించారు.


SAKSHITHA NEWS