ఒక నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ- రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

SAKSHITHA NEWS

ఒక నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ… రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

హాజరుకానున్న 9.47 లక్షల మంది

హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ వార్షిక పరీక్షలకు ఉదయం 9 గంటలు దాటి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఓఎంఆర్‌ పత్రాన్ని విద్యార్థులు పూర్తి చేయాలి. ఉదయం 8.00 నుంచి 8.45 గంటల వరకు పరీక్షకు అనుమతిస్తారు. కచ్చితంగా ప్రశ్నపత్రాన్ని 9 గంటలకు ఇస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని ఇంటర్‌బోర్డు స్పష్టంచేసింది.

ఇంటర్‌ పరీక్షలు ఈనెల 15న ప్రారంభమై ఏప్రిల్‌ 4 వరకు కొనసాగుతాయి. మొత్తం 9,47,699 మంది హాజరుకానున్నారు. ఎంపీసీ, బైపీసీ రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఈనెల 29వ తేదీతో ముగుస్తాయి. 2021, 2022లలో 70 శాతం సిలబస్‌తో పరీక్షలు జరగగా… రెండేళ్ల తర్వాత 100 శాతం సిలబస్‌తోపాటు గతంలో మాదిరిగా ఈసారి పరీక్షలు జరగనున్నాయి.

చూసుకోకపోతే కష్టాలు తప్పవు…

ఓఎంఆర్‌ పత్రం ఇవ్వగానే అందులో పేరు, సబ్జెక్టు తదితర అంశాలను సరిచూసుకోవాలి. జవాబుపత్రంలో 24 పేజీలు ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలి. ఒక రోజు ముందుగా…ముఖ్యంగా నగరాల్లో పరీక్ష కేంద్రాలను చూసుకొని రావడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల విద్యార్థులు అయోమయానికి గురై ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకొని నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి.

ఒత్తిడికి గురికాకుండా రాయండి: సబిత

ఇంటర్‌ విద్యార్థులు ఒత్తిడి, భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు సూచించారు. పరీక్షల నిర్వహణపై ఇంటర్‌ విద్యాశాఖ కార్యాలయంలో సోమవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కేంద్రాలకు పిల్లలు సకాలంలో చేరేలా ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

కంట్రోల్‌ రూమ్‌: 040-24601010, 246550275


SAKSHITHA NEWS

sakshitha

Related Posts

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSmla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సాక్షిత : మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి ఎమ్మెల్యేను…


SAKSHITHA NEWS

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWScollector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ *సాక్షిత వనపర్తి :జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ గడువు జులై 4తో ముగియడంతో నిబంధనల ప్రకారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లా ప్రజా…


SAKSHITHA NEWS

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page