SAKSHITHA NEWS

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా పెనుబల్లి మండలంలోని బన్నె వెంకట శ్రీనివాసరావు కుమారుని అన్నప్రాసన వేడుకలో పాల్గొని చిన్నారిని దీవించారు. సుజాతనగర్ మండలంలోని మంగపేటలో వైరా నియోజకవర్గ నాయకురాలు విజయబాయి నాయనమ్మ-తాతయ్యల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి సేవలను కొనియాడారు. సింగరేణి మండలంలోని మాణిక్యారం గ్రామంలో ధరావత్ బద్దులాల్ కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. కారేపల్లి క్రాస్ రోడ్ లోని శ్రీ సీతారామ ఎలక్ట్రానిక్స్ నూతన షాప్ ను ప్రారంభించారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఖమ్మం రూరల్ లోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో గుండా మధుకర్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. మద్దివారిగూడెంలో కల్లెం ఉపేందర్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన ఉప్పలమ్మ కార్యక్రమానికి, తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు గ్రామంలో కార్పొరేటర్ దొడ్డా నగేష్ ఇంట్లో నిర్వహించిన ఉప్పలమ్మ తల్లి వేడుకలో పాల్గొన్నారు. పలు ప్రయివేటు కార్యక్రమాలకు కూడా పొంగులేటి హాజరయ్యారు.


SAKSHITHA NEWS