రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీ యే ప్రత్యామ్నాయం – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

BJP is the alternative to BRS in the state – Former MLA Kuna Srisailam Goud

రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీ యే ప్రత్యామ్నాయం – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్


సాక్షిత : ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో 397,399,406 లకు సంబంధిత శక్తి కేంద్రంలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపి రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ హాజరై మాట్లాడారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ బ్రష్టుపట్టించాడని, కోట్ల రూపాయల అప్పుల పాలు చేసాడని అన్నారు.

కేసీఆర్ గ్రాఫ్ పడిపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భయం మొదలైందని అన్నారు. అందుకే ప్రజాసమస్యల మీద ఎవరైనా స్థానిక ఎమ్మెల్యే ను ప్రశ్నిస్తే అసహనంతో దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపి ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ బుచ్చి రెడ్డి,డివిజన్ అధ్యక్షులు పత్తి సతీష్, సదానందం, శక్తి కేంద్ర ఇంఛార్జ్ ఆదిత్య, బూత్ అధ్యక్షులు నాగరాజు, రాజ్ పుత్ రోహిత్, సంగం, నాయకులు భానుచందర్, జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page