బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పిలుపునిచ్చారు.
![బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ 2 brs](https://sakshithanews.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-15-at-6.20.47-PM-1024x577.jpeg)
మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెం గ్రామంలో పార్టీ కొయ్యలగూడెం గ్రామ వార్డు ఇంఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.