SAKSHITHA NEWS

Let’s celebrate Telangana Liberation Day

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం.

సమరయోధులను సగర్వంగా స్మరించుకుందాం.

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్
సాక్షిత: హైదరాబాద్ సంస్థానం విమోచనం పొంది 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా, రేపు ఉదయం పెరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు.

అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గా భావించే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. షాపూర్ నగర్ లోని ఆయన నివాసంలో బిజెపి నాయకులతో కలిసి తెలంగాణ విమోచన దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలు జరుపుతుంటే, కేసీఆర్ దానికి ఫోటిగా మజ్లిస్ పార్టీతో కుమ్మక్కై జాతీయ సమైక్యత వేడుకలు జరుపుతున్నారని దుయ్యబట్టారు.

ఎనిమిదేళ్లుగా జరపని జాతీయ సమైక్యత వేడుకలు ఇప్పుడే ఎందుకు నిర్వహిస్తున్నారని టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు జేకే శేఖర్ యాదవ్, సదానందం, గుబ్బల లక్ష్మీనారాయణ, రాజి రెడ్డి, బిల్లా వెంకటేష్, అంగడి మల్లేష్, మధు, చిలుక, విజయ్ శేఖర్, గుబ్బల రమణ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS