SAKSHITHA NEWS

సిర్వి సమాజ్ 19 వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ *
సాక్షిత : సుభాష్ నగర్ డివిజన్ లోని శ్రీ ఐమాత ఆలయంలో జరిగిన సిర్వి సమాజ్ వారి 19వ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, ముందుగా ఐమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన సిర్వి సమాజ్ 19 వ వార్షిక సమావేశంలో పాల్గొని, వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఐమాత ఆశీస్సులతో మార్వాడీల వ్యాపారాలు మెండుగా ముందుకు సాగాలని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కుత్బుల్లాపూర్ లో కూడా మరింత బలపరచాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిర్వి సమాజ్ భాద్యులు మంగీలాల్, నారాయణ లాల్ బర్ఫా, అర్జున్ లాల్ బర్ఫా, కేరరాంజీ, ప్రేమ్ పవార్, భావర్ లాల్ జి కాగ్, స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు


SAKSHITHA NEWS