ఎమ్మెల్యేను కలిసి సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసిన ఆశ వర్కర్లు…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ కు చెందిన ఆశ వర్కర్లు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకంలో భాగంగా తమకు ఇండ్లు, మెట్రో పాస్ లు, హెల్త్ కార్డులు మంజూరు చేసేలా కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు లలిత తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసి సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసిన ఆశ వర్కర్లు
Related Posts
కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు
SAKSHITHA NEWS కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరుసవాల్ ను స్వీకరిస్తూన్నాం …..చర్చకు రండి – మాజీ ఎంపీటీసీ తిరుపతి సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-….కమిషన్ లు లేనిది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు అని జీవోను మీ ప్రభుత్వ…
ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.
SAKSHITHA NEWS ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారుల సమీక్షకు నివేదికలు సిద్ధం చేయాలి. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్…