SAKSHITHA NEWS

బాచుపల్లిలో ‘హోమ్ ఫర్నిషింగ్స్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘హోమ్ ఫర్నిషింగ్స్‘ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, కార్పొరేటర్లు కాసాని సుధాకర్, విజయ లక్ష్మీ వెంకట సుబ్బారావు, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, సుజాత, కోఆప్షన్ మెంబర్ సలీం మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS