తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం

Spread the love

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ కి చెందిన శ్రీ సాదా దానయ్య కి మంజూరైన కిరాణా షాపును ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశంలోనే మొదటిసారి దళిత బంధు లాంటి పథకం తెలంగాణ లో ముఖ్యమంత్రి కె సి ఆర్ ప్రవేశపెట్టి, దళితులను అన్ని విధాలా అభివృధి పథంలో కొనసాగేలా చూస్తున్నారని, దీనిని దళితులు అందరూ సద్వినియోగ పరుచుకోవాలి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, గొట్టిముక్కల వేంకటేశ్వర రావు, తెరాస నాయకులు ఖదీర్, అశ్రఫ్, సిందమ్ శ్రీకాంత్, సాదా బాలయ్య, మహేష్, యాసిన్, రాజు సాగర్, అనీల్, మాధవి, వెంకటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page