SAKSHITHA NEWS

75 కిలో మీటర్ల సైకిల్ రైడ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
సాక్షిత : 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన నిర్వహించే 75 కిలో మీటర్ల సైకిల్ రైడ్ పోస్టర్ ను మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జక్కుల కృష్ణ యాదవ్, కాసాని వీరేష్ ముదిరాజ్, సైక్లింగ్ గ్రూప్ సభ్యులు నండునూరి రవీందర్, భీంసింగ్, గడీల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS