SAKSHITHA NEWS

నిధుల మంజూరుకు వినతి..
సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ని ప్రగతి భవన్ లో కలిసిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్.

ముఖ్యమంత్రి కె.చంద్ర శేకర్ రావు ని కలిసిన ఎమ్మేల్యే డా సంజయ్.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జగిత్యాల నియోజకవర్గ పరిధిలో పలు రోడ్లు,వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయని రోడ్లు మరియు వంతెనల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.బీర్ పూర్ మండల రోళ్ల వాగు ప్రాజెక్ట్ మరియు అర గుండాల ప్రాజెక్ట్ భారీ వర్షాలు,వరదలకు ప్రాజెక్ట్ లకు నష్టం వాటిల్లింది అని,నీటి నిల్వ సామర్థ్యం లేకుండా పోయిందని ప్రాజెక్ట్ కట్ట మరమ్మత్తు పనులను నిధులు మంజూరు చేయాలని, దాదాపు వెయ్యి ఎకరాలలో పంట నష్టం జరగడమే కాక ఇసుక మేటలు వేయడం వల్ల పంట సాగుకు ఇబ్బంది గా మారిందని రైతులకు నష్ట పరిహారం అందజేయాలని వారికి బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి ని కోరిన జగిత్యాల ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్.


SAKSHITHA NEWS