SAKSHITHA NEWS

సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి వినతులు
సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలు, బస్తీలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, కార్పొరేటర్ రావుల శేషగిరి, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నిజాంపేట్ కార్పొరేటర్లు శ్రీనివాస్ యాదవ్, బాలాజీ నాయక్, దుండిగల్ కౌన్సిలర్ శంకర్ నాయక్, రంగారెడ్డి నగర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య, సీనియర్ నాయకులు జెమ్మి దేవేందర్, అమర్ సింగ్, రవీందర్ నాయక్, భాస్కర్ రెడ్డి, సాయికిరణ్, నర్సింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS