SAKSHITHA NEWS

ప్రతి ఇంటికి సరిపడా మిషన్ భగీరథ నీరు అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

.
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని హరిదాస్ పల్లి గ్రామంలో 07:00 AM నుండి 11:30 AM వరకు పర్యటించారు.

◆ గ్రామంలో నీరు సరిపడా రావడం లేదని ప్రజలు తెలుపగా… రెండు నెలలుగా నీటి సరఫరా ఆగిపోతే మిషన్ భగీరథ అధికారులు ఏం చేస్తున్నారని, మిషన్ భగీరథ అధికారులు వెంటనే హరిదాస్ పల్లి గ్రామాన్ని సందర్శించి, సమస్యలు పరిష్కారం చేయాలని, వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు, మిషన్ భగీరథ నీరు రాలేని సమయంలో కచ్చితంగా ప్రత్యామ్నాయంగా నీరు అందించే ఏర్పాటు చేయాలని సూచించారు.

◆ గ్రామంలోని పిచ్చి మొక్కలు వెంటనే తొలగించాలని, శానిటేషన్ సరైన పద్దతిలో లేదని, పల్లె ప్రగతిలో ఏం చేశారని, పంచాయతీ కార్యదర్శి మరియు అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ శానిటేషన్ సమస్యలు పునరావృతం ఐతే చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

◆ గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేసి, గ్రామంలో మరియు పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, నూతన ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

◆ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, వాటిని వాడుకలో పెట్టుకోవాలని, బహిరంగ మల విసర్జన చేయరాదని ప్రజలకు సూచించారు.

◆ గ్రామంలో అత్యవసర నీటి సరఫరాకు చేతి పంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

◆ వర్షాకాలం సందర్భంగా గ్రామంలో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అనారోగ్యాలకు గురికారాదని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS