SAKSHITHA NEWS

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు…
సాక్షిత ::::మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దుండిగల్ మున్సిపాలిటీ 27వ వార్డు దుండిగల్ తాండా-2లో మోల్డ్ టెక్ సంస్థ వారు సీఎస్సార్ నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎస్సార్ నిధులతో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు మోల్డ్ టెక్ సంస్థ ముందుకు రావడం సంతోషకరమ్మన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి విజయ కుమారి, మండల విద్యాధికారి ఆంజనేయులు, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, శంకర్ నాయక్, జక్కుల కృష్ణ యాదవ్, జక్కుల శ్రీనివాస్, అర్కల అనంతస్వామి, సాయి యాదవ్, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ జగన్, ఎమ్మెల్లార్ఐటీ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, మోల్డ్ టెక్ సీఎండి జే.లక్ష్మణ్ రావు, డిఎండి ఏ.సుబ్రహ్మణ్యం, డిఎండి పి.వి.రావు, ఈడి ఎం.శ్రీనివాస్, మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, సీఎస్ఆర్ ప్రొఫెషనల్ భీమ్ సింగ్ నాయక్,జీహెచ్ఎంసీ కార్పొరేటర్ జగన్, గాజులరామారం డివిజన్ తెరాస అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు అమర్ సింగ్, ప్రవీణ్ నాయక్, రవి నాయక్, మోహన్ నాయక్, మురళి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, బైండ్ల గోపాల్, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS