court కోర్టు ఆదేశాలిచ్చింది.. అధికారులు అమలుచేయడం లేదు

SAKSHITHA NEWS

court కోర్టు ఆదేశాలిచ్చింది.. అధికారులు అమలుచేయడం లేదు
నీళ్లు, కరెంటు లేక ఏడేండ్లుగా కాలనీ వాసుల తీవ్ర ఇబ్బందులు
ఏడేండ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించండి
జిల్లా మంత్రులు, అధికారులు మా సమస్యలకు పరిష్కారం చూపండి
విలేకరుల సమావేశంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తాళ్లూరి కృష్ణ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఖమ్మం జిల్లా అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ వినోబా నవోదయ కాలనీ ప్రజలకు కనీస వసతులు నీళ్లు, కరెంటు కల్పించమని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు పరిష్కరించడం లేదని నూతన ప్రభుత్వంలోని జిల్లా మంత్రులు మా సమస్యలను పరిష్కరించాలని గ్రామీణ పేదల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తాళ్లూరి కృష్ణ కోరారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… గత ఐడేండ్లుగా ప్రత్యక్ష పోరాటం చేస్తున్న క్రమంలో హైకోర్టు వారి నుండి మంచి నీళ్ళు, కరెంట్ తో పాటు కనీస వసతులు కల్పించమని ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు అమలుచేయడంలేదన్నారు. ఆ సమస్యల పరిష్కారం కొరకు స్థానిక కలెక్టర్ వారి కార్యాలయంకు కాలనీ ప్రజలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేసేందుకు పోలీస్ వారు అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

జిల్లా కలెక్టర్ కు హైకోర్టు ఉత్తర్వులతో పాటు మా సమస్యలను చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని, లేదా స్వయంగా కలెక్టర్ కాలనీని సందర్శించి సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. గత ఏడేండ్లుగా పోరాడి ఇండ్ల స్థలాలు సాదించుకొని జీవనం కొనసాగిస్తున్నామని, కరెంట్, నీళ్లు కనీస వసతులు లేక పిల్లలతో కఠిక చీకటిలో దుర్భర జీవితం గడుపుతున్నామని జిల్లా మంత్రులు, నూతన జిల్లా అధికారులు మా సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా కమిటీ సభ్యులు కొప్పెర వెంకన్న, గ్రామీణ పేదల సంఘం జిల్లా కమిటీ సభ్యులు మంకిడి లింగరాజు, షేక్ అక్తర్ ఉన్నిషా బేగం, దంతోజు సంధ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

court

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSyouth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాంయువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం – యువజన సంఘాల అధ్యక్షులు మండ అశోక్ కమలాపూర్ సాక్షిత న్యూస్ ( జులై 6 ) youth యువకులకు, సామాన్య ప్రజలకు…


SAKSHITHA NEWS

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSgodavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలుపెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ లో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. నేరాల నిర్మూలన కోసమే…


SAKSHITHA NEWS

You Missed

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

You cannot copy content of this page