![padmaraoప్రజల ఇబ్బందుల నివారణలో అధికారులు సహకరించాలి 1 WhatsApp Image 2024 07 01 at 17.08.46](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-01-at-17.08.46.jpeg)
padmarao ప్రజల ఇబ్బందుల నివారణలో అధికారులు సహకరించాలి : పద్మారావు గౌడ్ ఆదేశం
సాక్షిత సికింద్రాబాద్ : అడ్డగుట్ట లోని గంగాపుత్ర సంఘం సమీపంలో నిర్మాణ సామగ్రి, చెత్త చెదారం వల్ల పాముల బెడదను తాము ఎదుర్కొంటున్న అంశాన్ని స్థానికులు సోమవారం సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడ్ ను కలిసి వివరించారు.
తాము పట్టుకున్న పామును వారు ఈ సందర్భంగా చూపుతూ తమ ఇబ్బందులను ఎకరువుపెట్టారు.
వెంటనే స్పందించిన పద్మారావు గౌడ్ జీ.హెచ్.ఎం.సి. అధికారులను సంప్రదించి 24 గంటల్లో వారి ఇబ్బందిని పరిష్కరించాలని, పాములు సంచరించ కుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.
ప్రజల ఇబ్బందులను వెంటనే పరిష్కరించని పక్షంలో తాము తీవ్రంగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app
![padmaraoప్రజల ఇబ్బందుల నివారణలో అధికారులు సహకరించాలి 2 padmarao](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-01-at-17.08.46-576x1024.jpeg)