SAKSHITHA NEWS

Talasani Srinivas Yadav was visited by Legislative Council Chairman Gutta Sukhender Reddy.

మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మరణించగా, శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, MLC MS ప్రభాకర్ రావు లు వెస్ట్ మారేడ్ పల్లి లోని శంకర్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం శ్రీనివాస్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు.


SAKSHITHA NEWS