SAKSHITHA NEWS

Badibata program should be organized in all villages: MPDO

అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి: MPDO

సాక్షిత : అన్ని గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని శంకర్‌పల్లి ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ అన్నారు.
 
ఇవాళ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ బడి బయట పిల్లల్ని, బాల కార్మికులను, అంగన్వాడి పిల్లలను బడిలో చేర్పించాలన్నారు.

ఎ ఎ పి సి పనులను పూర్తి చేసి పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

కార్యక్రమంలో మోకిల సీఐ వీరబాబు, శంకర్‌పల్లి యస్ ఐ సత్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్వైజర్, హాస్టల్ సూపర్వైజర్స్, ఏపీఎం పాల్గొన్నారు.
Badibata program should be organized in all villages: MPDO

SAKSHITHA NEWS