తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం

Spread the love

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం నాయకులు

……

సాక్షిత : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో మర్యాద పూర్వకంగా కలిసి మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పూల మొక్క అందజేసి శాలువాతో సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన జగిత్యాల మున్నూరుకాపు సంఘ నాయకులు,అనంతరం మున్నూరుకాపు వర్తక వ్యాపారుల సంఘం 2024 డైరీని సిఎం కు అందజేశారు.,

ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్నూరు కాపు సంఘం నాయకులు బండారి రాజ్ కుమార్, దీటి అంజయ్య పటేల్,అంగలి రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page