SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ లోని పలు ప్రాంతాల్లోని ఈద్గాల వద్ద నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని హెచ్ఎంటీ గ్రౌండ్స్, వెంకట్ రాంరెడ్డి నగర్, గురుమూర్తి నగర్, గాంధీనగర్ విజయనగర్ కాలనీ, ప్రాంతాలలోని ఈద్గా వద్ధ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ అల్లా రక్షణ, కరుణ, మీ అందరికీ సహాయ సహకారాలతో నాకు మూడవసారి 85576 ఓట్ల భారీ మెజార్టీతో విజయాన్ని అందించినారు. రానున్న రోజుల్లో పెండింగ్ లో ఉన్న ఈద్గాల నిర్మాణం కొరకు స్థలం కేటాయింపు వంటి పనులను పూర్తి చేస్తానన్నారు.

ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగి చిరు జీవితాన్ని ఆనందంతో నింపీ పుణ్యకార్యాల వైపు ప్రజలంతా చైతన్యమై ముందుకు సాగాలన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, శ్రమ శక్తి అవార్డు గ్రహీత ఎత్తరి మారయ్య, మైనారిటి నాయకులు అబ్దుల్ ఖాదర్, అలీ, రషీద్, హర్షద్, హఫీజ్, మతీన్, హమీద్, అక్బర్, అలావుద్దిన్, ఆసిఫ్, గౌస్ బాయ్, షకీర్, సంక్షేమ సంఘాల సభ్యులు సతీష్ గట్టోజీ, జల్ద లక్ష్మీనాథ్, బాలు నేత, నాయకులు లక్ష్మణ్, సోను, కార్తీక్, రమ్మీ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS