రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్ -గా – గుల్షన్ దర్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన

Spread the love

రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్ -గా – గుల్షన్ దర్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు …

……

సాక్షిత వరంగల్ జిల్లా….
రంజాన్ పర్వదినం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్ పరిధిలోని మామునూర్ క్యాంప్ లోని ఈద్ -గా – గుల్షన్ దర్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* .. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ అని తెలిపారు. రంజాన్ మాసంలో ఆచరించి ప్రార్థనలు, ఉపవాసం క్రమశిక్షణను ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు తమ పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అలాగే నేను ఈ ప్రాంతం నుంచి పెరిగి ఉన్నత విద్యలను అభ్యసించి నా చిన్నతనం నుంచి ఎన్నో క్రీడలో పాల్గొన్ని ఒక హకీ ప్లేయర్ గా అంతర్జాతీయ స్థాయిలో వెళ్లడం నాకు చాలా ఆనందకరమని మరియు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం నాకు చాలా సంతోషకరమని వారు రంజాన్ పండుగ సందర్భంగా తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈదుల అరుణ విక్టోరియా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింత ప్రకాష్ ముస్లిం పెద్దలు బాబా భాయ్, జమీర్, సిధిక్,అఫ్జల్, ఎం.డి సర్వర్, ఎం.డి నయీముద్దీన్ ముస్లిం సోదరులు మరియు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page