టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

Spread the love

టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి ని కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి ని కలిసి మద్దతు కోరారు. ఎన్నికలవేళ తనకు అండగా నిలువాలని కోరారు. తన విజయానికి తమ వంతుగా తోడ్పాటును అందించాలన్నారు. తనకు ఎంపీగా అరుదైన అవకాశాన్నిచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి, తనకు సహకరించిన పెద్దలకు రుణపడి ఉంటానని నీలం మధు ఈ సందర్భంగా పేర్కొన్నారు.తన సంపూర్ణ మద్తత్తు ఉంటుంది అని డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి తెలిపారు, ఈ కార్యక్రమంలో intuc సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహ రెడ్డి, మెదక్ intuc ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ దుబ్బాక ఎంపీటీసీ సంజీవరెడ్డి , కౌన్సిలర్ కొల్లూర్ మల్లేష్,నారాయణ రెడ్డి, తిరుమల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page