SAKSHITHA NEWS

శంకర్‌పల్లి మండల మరియు మున్సిపాలిటీలో
బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ధర్మన్న వెంకట్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ ఆధ్వర్యంలో నగరంలోని వికారాబాద్ జెడ్పి చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జడ్పీ చైర్మన్.. వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను చూసే పార్టీలో చేరానన్నారు. కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, కౌన్సిలర్ సంతోష్, మాజీ ఎంపిటిసి ఎజాస్, రాజు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షుడు మహబూబ్ హుస్సేన్, మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ నసీరుద్దీన్, నరసింహులు గౌడ్, కృష్ణారెడ్డి, భరత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.


SAKSHITHA NEWS