సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్ను మూశారు. ఢిల్లీలో రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.
సుప్రీంకోర్టులో న్యాయ వాదిగా 1971 నుంచి ఆయన సేవలందించారు. అదనపు సొలిసిటర్ జనరల్గా 1972-75 మధ్యకాలంలో పని చేశారు.
1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి. రాజ్యసభ సభ్యుడిగా, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
![సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత 2 WhatsApp Image 2024 02 21 at 11.56.40 AM](https://sakshithanews.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-21-at-11.56.40-AM-1024x970.jpeg)