SAKSHITHA NEWS

శ్రీరాముని ఫ్లెక్సీలను తొలగించి చెత్త బండిలో పడేసిన వైనం
మున్సిపల్ సిబ్బంది తీరుపై ఆగ్రహించిన నేతలు
శంకర్పల్లి చౌరస్తాలలో ఆందోళన చేపట్టిన హిందు వాహిని కార్యకర్తలు
ఆందోళన విరమింప చేసే ప్రయత్నంలో స్థానిక పోలీసులు* రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన మున్సిపల్ కార్మిక సిబ్బందిపై స్థానిక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హిందు వాహిని కార్యకర్తలు స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బాల రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన పురస్కరించుకొని ఏర్పాటు చేసిన శ్రీరాముని ఫ్లెక్సీలను తొలగించి చెత్త బండ్లలో తరలించుటను నిరసిస్తూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శంకర్పల్లి ముఖ్య కూడలిలో ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక పోలీసులు జోక్యంతో ఆందోళనకారులను విరమింప చేసే ప్రయత్నం చేస్తున్నారు.


SAKSHITHA NEWS