SAKSHITHA NEWS

చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో ఆర్య వైశ్య అమావాస్య అన్నదానం కమిటీ శేరిలింగంపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అన్నప్రసాదాలు వడ్డించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజున ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం చాలా గొప్ప విషయం అని, అన్ని దానంల కన్నా అన్నదానం గొప్పది అని ,పేద ప్రజలకు ఆకలి తీర్చే గొప్ప కార్యక్రమం అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. ఈ సంధర్భంగా నిర్వాహకులను ప్రత్యేకంగా ఎమ్మెల్యే గాంధీ అభినదించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ.వెంకటేష్, పబ్బా మల్లేష్ ,పులిపాటి నాగరాజు, అక్బర్ ఖాన్, అంజద్ పాషా ,సందీప్ రెడ్డి, అవినాష్ , పి శ్రీనివాస్, జయ కృష్ణ, గోలి రాజు, సత్యనారాయణ గంప, వర్మ శ్రీనివాస్ ,ప్రభాకర్, శ్రీనివాస్, నటరాజ ,లక్ష్మణ్, చిన్న, వెంకట్, విష్ణు ,బాబే తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS