SAKSHITHA NEWS

అభివృద్ధి చేసి చూపిస్తాం బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్

బిజెపి కి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని బిజెపి అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ అన్నారు. బొల్లారం మున్సిపల్ లో పలు కాలనీలో ఇంటింటికి ఆయన పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.పాత బస్తిలో పార్టీ సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి ఘనంగా పూలు విరజళ్ళుతు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగలని కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటు వేసినట్టు అని కాంగ్రెస్ అమ్ముకునే పార్టీ అని ఆరోపించారు.

అర్ధరాత్రి అయినా సరే తనతో ఏ పని అయినా ఒక అన్నలాగా ఓ ఇంటికి పెద్ద కొడుకు లాగా మీకు తోడుగా ఉంటానని మరియు బొల్లారం మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఈ నెల 18వ తేదీన “చటి మయ్య పూజ” పర్వదినం పురస్కరించుకొని మైత్రి గ్రౌండ్ లో ప్రముఖ భోజ్ పూరి నటుడు, పవర్ స్టార్ పవన్ సింగ్ తరలి వస్తున్నారని ప్రతి ఒక్కరూ హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యవర్గ సభ్యురాలు మేఘనా రెడ్డి, మాజీ మహిళా మోర్చా డి.స్రవంతి రెడ్డి, కార్యవర్గ సభ్యులు పి.శ్రీకాంత్ రెడ్డి, మాజీ అధ్యక్షులు భరత్ చారి, సీనియర్ నాయకులు రాఘవేంద్ర రెడ్డి,లక్ష్మణ్ స్వామి, అరుణ్ కుమార్, రోహిత్ సింగ్, భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS